సెల్ఐటి న్యూస్,అమరావతి: ఆహార శుద్ధి పరిశ్రమలతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పుడ్ పార్కు పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో మంత్రి అమరనాథ రెడ్డి ఫుడ్ పార్కు యాజమన్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్ సిఇఒ వైఎస్ ప్రసాద్, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించడం వల్ల రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి ఈ పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి, దీని కోసం ప్రత్యేక పాలసీని తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ రైతుల ఆదాయం రెట్టింపు చేసే ఆహార శుద్ధి పరిశ్రమలకు సబ్సిడీలు ఆలస్యం కాకుండా ఇస్తున్నామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలకు రూ.350 కోట్ల సబ్సిడీలు విడుదల చేశామని మంత్రి తెలిపారు. ఫుడ్ పార్కులను త్వరితగతిన అభివృద్ధి చేయాలని, ఏమైనా ఆటంకాలు ఎదురైతే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తాను చొరవ చూపుతానని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు ఫుడ్ పార్కుల యాజమన్యాల నుంచి సహకారం అవసరమని తెలిపారు. ఉత్తర కోస్తాలో జీడిపప్పు యూనిట్లు ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ యూనిట్లు స్థాపించేవారికి 25 శాతం సబ్సిడీ ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని మంత్రి చెప్పారు.
సెల్ఐటి న్యూస్, అమరావతి: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా Read more →
సెల్ఐటి న్యూస్, బిజినెస్ డెస్క్: విజయవాడలో అతిపెద్ద టైల్స్ శానిటరి షోరూం నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షోరూం యజమాని ఎండి Read more →