రాష్ట్ర సరిహద్దులోని గ్రామాల్లో భారీగా నాటుసారా ద్వంసం
విజయనగరం క్రైం, సెల్ఐటి న్యూస్: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) కమిషనర్ వినీత్ బ్రిజ్లాల్ ఆదేశాల మేరకు విజయనగరం సెబ్, ఒడిశా రాష్ట్రాల పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోని యెదుగుబాల్సా, ఆలమండ, కప్పలడ, బిత్తరపాడ, జయకోట జిల్లాలలో ముమ్మరంగా నాటుసారా తయారీ కేంద్రాలపైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నాటుసారాను ద్వంసం చేశారు. దాడుల్లో సెబ్ అడిషనల్ ఎస్పీ ఎన్.శ్రీదేవిరావు పర్యవేక్షణలో ఇసుక అక్రమ రవాణా, మద్యం, నాటుసారా కట్టడికి జిల్లాలో సెబ్
టీం, పోలీసు, ఎక్సైజ్ పోలీసులు, ఒరిస్సా పోలీసుల సమన్వయంతో దాడులను నిర్వహించారు. 52,100 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేయడంతో పాటు 150 కిలోల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు.