సీఎం జగన్ని కలిసిన తమిళనాడు మంత్రుల బృందం
సెల్ఐటి న్యూస్, అమరావతి: తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఆదేశాల మేరకు సీఎం వైయస్ జగన్తో భేటీ తమిళనాడు మంత్రుల బృందం శుక్రవారం విజయవాడలో భేటీ అయ్యింది. తాగునీటితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది. తాగడానికి నీళ్లులేక 90లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. చెన్నైలో నీటి కష్టాలను సీఎంకు వివరించిన తమిళనాడు మంత్రుల బృందం. చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని సీఎం జగన్కు విజ్ఞప్తి. తమిళనాడు మంత్రుల బృందం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం వైయస్ జగన్ వెంటనే చెన్నైకి తాగునీటి జలాలు ఇవ్వాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారే చేశారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలి అని తమిళనాడు మంత్రుల బృందంతో సీఎం వైయస్ జగన్ అన్నారు. ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాలి అన్నారు. అన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశించిన సీఎం వైయస్ జగన్ చెన్నైకి తాగునీటి జలాలు ఇస్తన్నందుకు కృతజ్ఞతలు తెలిపిన తమిళనాడు మంత్రుల బృందం. చెన్నైలోని 90 లక్షల మంది ప్రజల ఆశీస్సులు సీఎం వైయస్ జగన్కు ఉంటాయన్న తమిళనాడు మంత్రుల బృందం. మేం అడగ్గానే మానవత్వంతో స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి గణేశన్, మత్స్య శాఖ, పాలనా సంస్కరణల శాఖమంత్రి జయకుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ మనివాసన్ వున్నారు.