ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై కరపత్రం…
* మహిళా మార్చ్ బ్రోచర్ను విడుదల చేసిన సీఎం జగన్
అమరావతి, సెల్ఐటి న్యూస్: వంద రోజుల మహిళా మార్చ్ బ్రోచర్ను శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం విడుదల చేశారు. నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలు, వాటిపై అవగాహనతో పాటు దశలవారీ మద్యపాన నిషేధం, దిశ యాప్, ఇతర చట్టాలు, హెల్ప్లైన్ నంబర్లపై మార్చి 8 వరకు వంద రోజుల కార్యాచరణను ఏపీ మహిళా కమిషన్ రూపొందించింది. వంద రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాలేజీ విద్యార్ధినులకు రక్షణ టీంలు, సైబర్ నేరాలపై అవగాహన సదస్సులను మహిళా కమిషన్ నిర్వహించనుంది. బ్రోచర్ ఆవిష్కరణలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్.కె.రోజా, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్.అనూరాధ, మహిళా కమిషన్ డైరెక్టర్ ఆర్. సుయజ్ పాల్గొన్నారు.