సిబ్బంది కృషితోనే అత్యుత్తమ ఫలితాలు …
* దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య వెల్లడి
* 65వ రైల్వే వారోత్సవాలను జరుపుకున్న దక్షిణ మధ్య రైల్వే
సికింద్రాబాద్, సెల్ఐటి న్యూస్: 2019-20 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శనతో మరోసారి అభివృద్ధి పథంలో కొనసాగడానికి జోన్ అధికారి నుంచి సిబ్బంది అసాధారణ సేవలే కారణమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అన్నారు. సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచి బుధవారం వర్చువల్ విధానంలో నిర్వహించిన 65వ రైల్వే వారోత్సవాలను ఉద్దేశించి గజానన్ మాల్య ప్రసంగించారు. అదనపు జరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు చీఫ్ విజిలెన్స్ అధికారి చంద్రిమా రాయ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ విభాగాల ఉన్నత అధిరులు, డివిజినల్ రైల్వే మేనేజర్లు వర్చువల్ కార్యక్రమంలో పాల్గొని వ్యక్తిగత అవార్డు, గ్రూప్ అవార్డు మరియు షీల్డ్ బహుమతులను వారివారి స్థానాల నుండి విజేతలకు అందజేశారు. భారత గడ్డపై 16 ఏప్రిల్ 1853 తేదీన మొట్టమొదటి ప్రారంభించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ వారోత్సవాను ఏటా ఏప్రిల్ మాసంలో నిర్వహిస్తారు. అయితే ప్రస్తుత కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం బుధవారం నిర్వహించారు. ఈ
సందర్భంగా గజానన్ మాల్య మాట్లాడుతూ 2019-20 ఆర్థిక సంవత్సరంలో జోన్ రూ.13,771 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసిందన్నారు. జోన్లో 109.5 మిలియన్ టన్ను సరుకు రవాణాతో రూ.9,029 కోట్ల ఆదాయం, 363 మిలియన్ల ప్రయాణికుల రవాణాతో రూ.4,119 కోట్లు ఆర్జించిందని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 60 కి.మీ కొత్త రైల్వే లైను నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో మరో 218 కి.మీడబ్లింగ్/ట్రిప్లింగ్ పను పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ పనులో క్లూరు`గుంతకల్, గుంటూరు`తెనాలి మరియు పర్బాని`ముద్ఖేడ్ సెక్షన్లలో మేజర్ డబ్లింగ్ ప్రాజెక్టు కూడా ఉన్నాయి. దీనికి అదనంగా మౌలాలి`ఘటకేసర్ మధ్య జోన్లో మొదటిసారిగా 12 కి.మీ నాుగు వరుస లైన్ ఈ సంవత్సరం ఏర్పాటైందన్నారు. అదేవిధంగా 153 కి.మీ రైల్వే లైన్లను విద్యుద్థీకరించడంతో జోన్లో విద్యుద్ధీకరణ క్ష్యానికి బలం చేకూరింది. ప్రయాణికు వసతులు, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 2019`20 సంవత్సర కాంలో దీనినిమిత్తం రూ.150 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. జనరల్ మేనేజర్ యొక్క ‘‘ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్ షీల్డ్’’ సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ డివిజన్లకు సంయుక్తంగా ప్రదానం చేశారు. ఈ సంవత్సరం జనరల్ మేనేజర్ ‘‘ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్ ఎఫిషియన్సి షీల్డ్’’ అవార్డును సికింద్రాబాద్ మరియు హైదరాబాద్
డివిజన్లకు గజానన్ మాల్య సంయుక్తంగా ప్రదానం చేశారు. సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఆనంద్ భాటియా, హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ సంయుక్తంగా షీల్డులను అందుకున్నారు. జనరల్ మేనేజర్ 33 జోనల్ లెవెల్ ఎఫిషియన్సీ షీల్డ్ను జోన్లోని వివిధ విభాగాలకు మరియు వర్క్షాప్నకు బహుకరించారు. సికింద్రాబాద్ డివిజన్ బెస్ట్ స్క్రాప్ డిస్పోసల్ షీల్డ్ (సంయుక్తంగా), బెస్ట్ డీజిల్ ట్రాక్షన్ షీల్డ్, బెస్ట్ లోడిరగ్ ఎఫర్ట్ షీల్డ్, బెస్ట్ మెడికల్ షీల్డ్, ఎక్ట్రికల్ షీల్డ్, ఆపరేటింగ్ షీల్డ్, బెస్ట్ మెయిన్టెడ్ లాంగ్ డిస్టెన్స్ ట్రెయిన్ షీల్డ్ మరియు బెస్ట్ మెయిన్టెడ్ ఏఆర్టీ (సంయుక్తంగా) అవార్డును అందుకుంది. హైదరాబాద్ డివిజన్ బెస్ట్ మెయిన్టెడ్ డెము/మెము/ఈఎమ్యూ షీల్డ్, బెస్ట్ డివిజన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ లెవల్ క్రాసింగ్స్, బెస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ హౌస్ కీపింగ్ షీల్డ్, సెక్యూరీటి షీల్డ్ మరియు ట్రాన్స్ఫార్మెషన్ షీల్డ్ అవార్డును అందుకుంది. విజయవాడ డివిజన్ హిందీ (రాజభాష) షీల్డ్, జీఎమ్ షీల్డ్ ఫర్ క్లీన్లైన్స్ (స్టేషన్స్), బెస్ట్ మెయిన్టెడ్ రన్నింగ్ రూమ్ షీల్డ్, మెకానికల్ షీల్డ్, ఫైనాన్స్ (అకౌంట్స్) షీల్డ్, సివిల్ ఇంజినీరింగ్ షీల్డ్ (సంయుక్తంగా) మరియు బెస్ట్ మెయిన్టెడ్
ఎమ్ఆర్వీ (సంయుక్తంగా) షీల్డ్ అవార్డును అందుకుంది. గుంతకల్ డివిజన్ బెస్ట్ స్కూల్ (రైల్వే హై స్కూల్, ఇంగ్లీష్ మీడియం, గుంతకల్), బెస్ట్ ఎనర్జీ కన్వర్వేషన్ షీల్డ్ (ఎక్రికల్), బెస్ట్ మెయిన్టెడ్ ఏమ్ఆర్వీ (సంయుక్తంగా), సిగ్నల్ అండ్ టెలికామ్ షీల్డ్, హెచ్ఆర్డీ (పర్సనల్), సివిల్ ఇంజినీరింగ్ (సంయుక్తంగా) అవార్డు అందుకుంది. గుంటూరు డివిజన్ బెస్ట్ యుటిలైజేషన్ ఆఫ్ ట్రాక్ మెషిన్స్, బెస్ట్ మెేయిన్టేడ్ ఏఆర్టీ (సంయుక్తంగా), బెస్ట్ స్క్రాప్ డిస్పోజల్ షీల్డ్ (సంయుక్తంగా), బెస్ట్ గ్రివెన్స్ దిడ్రెసల్ మెషినరీ షీల్డ్, బెస్ట్ సేఫ్టీ షీల్డ్ (సంయుక్తంగా), మరియు కమర్షియల్ షీల్డ్ అవార్డ్డు అందుకుంంది. నాందేడ్ డివిజన్ బెస్ట్ ట్రాక్ షీల్డ్, బెస్ట్ ఇన్నోవేషన్స్ షీల్డ్ మరియు బెస్ట్ సేఫ్టీ షీల్డ్ (సంయుక్తంగా) అవార్డు అందుకుంది. కనస్ట్రక్షన్ విభాగం/విజయవాడ బెస్ట్ సర్వే అండ్ కనస్ట్రక్షన్ షీల్డ్ అవార్డు అందుకుంది. రాయనపాడు వర్క్ షాప్ బెస్ట్ ఇన్నోవేషన్స్ షీల్డ్ (సంయుక్తంగా), మెకానికల్ వర్క్ షాప్ షీల్డ్ మరియు బెస్ట్ స్టోర్స్ డిపో షీల్డ్ అవార్డు అందుకుంది. 65వ రైల్వే వారోత్సవాల సందర్భంగా జనరల్ మేనేజర్ 173 వ్యక్తిగత అవార్డులు మరియు 11 గ్రూప్ అవార్డులను అధికారులకు మరియు సిబ్బందికి వారి పనితీరుకు గుర్తింపుగా అందజేశారు.