కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ
* వచ్చే నెల 10న మున్సిపల్ ఎన్నికలు
* ఆ రోజున సెలవు ప్రకటించాలని ఆదేశం
* పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్
విజయవాడ, సెల్ఐటి న్యూస్: ఏపీలో పంచాయతీ ఎన్నికలు ముగిసిపోయాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. మార్చి 10న మునిసిపల్ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో మార్చి 10న సెలవు దినంగా ప్రకటించాలని ఆదేశించారు. పోలింగ్, కౌంటింగ్ (మార్చి 14) రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని తెలిపారు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను ఉయోగించుకోవాలని చెప్పారు. ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సోమవారం నిమ్మగడ్డ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో మొత్తం 12 నగర పాలికలు, 75 పురపాలికలకు ఎన్నికలు జరగనున్నాయి.