ఈబీసీ నేస్తం’ పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం
* అగ్రవర్ణాల్లో పేద మహిళలకు ఏటా రూ.15వేలు ఆర్థిక చేయూత
* విశాఖ స్టీల్ప్లాంట్పై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం
అమరావతి, సెల్ఐటి న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. సచివాలయం మొదటి బ్లాక్ సమావేశ మందిరంలో మంగళవారం కొనసాగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, మంత్రులు కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాస్రెడ్డి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గతంలో తీసుకున్న కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా నవరత్నాలు పథకాలపై ఈ ఏడాది క్యాలెండర్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది. వచ్చే ఏప్రిల్ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించింది. కేబినెట్ ఆమోదంతో 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించేపథకాల క్యాలెండర్ అమల్లోకి రానుంది. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చ జరిగింది. రాష్ట్రంలో జరగనున్న అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ మంత్రులకు వివరించారు. కాగా పంచాయతీ ఎన్నికల్లో భారీ విజయాలపై సీఎంమంత్రులను అభినందించారు. పంచాయతీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 80 శాతం ఫలితాలు సాధించామని జగన్ తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ త్వరగా ఇవ్వకపోతే మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ప్లాంట్పై అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వైయస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఫేజ్ -1లో ౩ మిలియన్ టన్నులు, ఫేజ్-2లో 3 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణం. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల మహిళలకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.670కోట్లు, మూడు సంవత్సరాలకు సుమారు రూ.2011 కోట్లు కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ డవలప్మెంట్ లేఅవుట్ అండ్ సబ్డివిజన్- 2017 చట్టానికి సవరణ, కేబినెట్ ఆమోదం. టిడ్కో ద్వారా చేపడుతున్న 300 చదరపు అడుగులు ఇళ్లు విలువ గతంలో రూ.2.65 లక్షలు కాగా.. ఆ ఇళ్లను ఇప్పుడు రూ.1కే కేటాయింపు. 365 చదరపు అడుగుల ఇళ్లు గతంలో రూ.3.65 లక్షలు అయితే ఇప్పుడు రూ.3.40 లక్షలకు కేటాయింపు. 430 చదరపు అడుగుల ఇళ్లు గతంలో రూ.4.65 లక్షలు అయితే ఇప్పుడు రూ.4.15 లక్షలకు కేటాయింపు. ఈ నిర్ణయాల కారణంగా టిడ్కో ఇళ్ల విషయంలో అదనంగా రూ. 5579 కోట్ల రూపాయలు భారాన్ని మోస్తున్న ప్రభుత్వం.
1. 2021–22 సంవత్సరానికి సంబంధించి నవరత్నాల అమలు కేలెండర్కు కేబినెట్ ఆమోదం
– ఏప్రిల్లో వసతి దీవెన, సుమారు 15 లక్షల 56 వేల 956 మందికి లబ్ధి
– ఏప్రిల్, జూలై, డిసెంబరు, పిబ్రవరి–2022 జగనన్న విద్యా దీవెన (సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్) అమలు. దాదాపు 18 లక్షల 80 వేల 934 మందికి లబ్ధి
–జూన్లో జగనన్న విద్యా కానుక, దాదాపు 42 లక్షల 34 వేల 322 మందికి లబ్ధి
–ఏప్రిల్లో రైతులకు వడ్డీలేని రుణాలు (రబీ 2019, ఖరీప్ 2020కు సంబంధించి) దాదాపు 66 లక్షల 11 వేల 382 మందికి లబ్ధి
–ఏప్రిల్లో డ్వాక్రా అక్కచెల్లమ్మలకు వడ్డీలేని రుణాలు, దాదాపు 90 లక్షల 37 వేలు 255 మందికి లబ్ధి
–మేలో 2020 ఖరీఫ్కు సంబంధించి పంటల బీమా చెల్లింపు, దాదాపు 9 లక్షల 48వేల మందికి లబ్ధి
–మే, అక్టోబరు, జనవరి 2022లలో మూడు దఫాలుగా రైతుభరోసా, దాదాపు 54 లక్షల 300 మందికి లబ్ధి
–మేలో మత్స్యకార భరోసా, దాదాపు 1 లక్షా 9 వేల 231 కుటుంబాలకు లబ్ధి
–మే నెలలో మత్స్యకార భరోసా కింద డీజిల్ సబ్సిడీ చెల్లింపు, దాదాపు 19 వేల 746 మందికి లబ్ధి
–జూన్లో వైయస్సార్ చేయూత కింద దాదాపు 24 లక్షల 55 వేల 534 మందికి లబ్ధి
–జూలైలో వైయస్సార్ వాహనమిత్ర పథకం కింద దాదాపు 2 లక్షల 74వేల 15 మందికి లబ్ధి
–జూలైలో కాపునేస్తం పథకం కింద దాదాపు 3 లక్షల 27 వేల 862 మందికి లబ్ధి
–ఆగష్టులో రైతులకు వడ్డీలేని రుణాలు (ఖరీప్ 2021కు సంబంధించి) దాదాపు 25 లక్షల మందికి లబ్ధి
–ఆగష్టులో ఎంఎస్ఎంఈ, స్పిన్నింగ్మిల్లులకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్లు చెల్లింపు, దాదాపు 9 వేల 800 మందికి లబ్ధి
–ఆగష్టులో నేతన్ననేస్తం పథకం కింద దాదాపు 81 వేల 703 మందికి లబ్ధి
–ఆగష్టులో అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపులు, దాదాపు 3 లక్షల 34 వేల 160 మందికి లబ్ధి
–సెప్టెంబరులో వైయస్సార్ ఆసరా కింద దాదాపు 87 లక్షల 74 వేల 674 మందికి లబ్ధి
–అక్టోబరులో జగనన్న తోడు పథకం కింద దాదాపు 9 లక్షల 5 వేల ముగ్గురికి లబ్ధి
–అక్టోబరులో టైలర్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులుకు జగనన్న చేదోడు కింద దాదాపు 2 లక్షల 98 వేల 428 మందికి లబ్ధి
–నవంబరులో ఆర్దికంగా వెనుకబడిన మహిళలకు ఈబీసీ నేస్తం పథకం, దీనికింద దాదాపు 6 లక్షలమందికి లబ్ధి.
ఇవాళ ఈ పథకానికి కేబినెట్ ఆమోదం.
–జనవరి, 2022 అమ్మఒడి అమలు, దీనికింద దాదాపు 44 లక్షల 48 వేల 865 మందికి లబ్ధి
పై పథకాలతో మొత్తంగా 5 కోట్ల 8 లక్షల 8 వేల 220 మందికి లబ్ధి నెలవారీ ఇచ్చే పెన్షన్లతోకలిపి 5,69,81,184 ప్రయోజనాలు
ఇవి కాకుండా..
–వైయస్సార్ లా నేస్తం కింద దాదాపు 2012 మందికి ప్రతినెలా లబ్ధి జగనన్న గోరుముద్దద్వారా 36లక్షల, 88వేల 618 మందికి లబ్ధి
– వైయస్సార్ సంపూర్ణ పోషణద్వారా 30,16,000 మందికి లబ్ధి
-ఇమామ్, మౌజామ్లకు ఆర్ధిక సాయం ద్వారా 77,290 మందికి లబ్ధి
– ఇంకా మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లపట్టాల పంపిణీ
-వీరితో పాటు నెలవారీ ఇంటింటికి రేషన్ అందుకుంటున్న లబ్ధిదారులు
2.
ఆర్ధికంగా వెనుకబడ్డ అగ్రకులాలకు చెందిన మహిళలకు జగనన్న వరం, ఆర్ధికంగా వెనుకబడ్డ వర్గాలకు ఈబీసీ నేస్తం కింద ఏడాదికి రూ.15వేలు. మూడేళ్ల పాటు రూ.45 వేలు. 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు వర్తింపు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇది వరకే చేయూత పథకం.
కాపులకు కాపు నేస్తం
అదే తరహాలో ఆర్ధికంగా వెనుకబడ్డ ఉన్నత కులాల్లోని మహిళలకు ఈబీసీ నేస్తం వర్తింపు
3.
వైయస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలకు ఇళ్ల స్ధలాలు ఇచ్చే కార్యక్రమం కోసం ప్రైవేటు లేఅవుట్లలోని 5 శాతం స్ధలాన్ని కలెక్టర్లకు అప్పగించేలా నిర్ణయం ప్రైవేటు లేఅవుట్లో 5 శాతం భూమి లభ్యత లేకపోతే 3 కిలోమీటర్ల దూరం లోపల కొనుగోలు చేసి కలెక్టర్లకు అప్పగించాలని నిర్ణయం ఈ ల్యాండ్ బ్యాంకును వైయస్సార్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు వినియోగించనున్న ప్రభుత్వం. పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు
4.
300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్ల కోసం పేదల వద్ద నుంచి గత ప్రభుత్వం వసూలు చేసిన డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం 1 లక్షా 43 వేల 600 మందికి ఒకే ఒక్క రూపాయితో ఇళ్లను అప్పగిస్తున్న ప్రభుత్వం 365, 430 చదరపు అడుగులకు సంబంధించి వారు కట్టిన మొత్తంలో 50శాతం డబ్బును సబ్సిడీ రూపంలో ఇస్తున్నట్టు ఇదివరకే అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి 365 చదరపు అడుగుల లబ్ధిదార్లకు రూ.25వేలు, 430 చదరపు అడుగుల లబ్ధిదార్లకు రూ.50 వేలు సబ్సిడీ ఈ మేరకు మినహాయించిన నగదును వెనక్కి ఇవ్వనున్న ప్రభుత్వం టిడ్కో కాలనీలకు వైఎస్ జగనన్న నగర్గా పేరుపెట్టేందుకు కేబినెట్ ఆమోదం
5.
అమరావతి ప్రాంతంలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (రోడ్లు) మరియు ఎల్పియస్ పనులు (సమీకరించిన భూముల్లో పనులు)కు సంబంధించి రూ.3వేల కోట్ల నిధులకు ప్రభుత్వ గ్యారంటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
6.
ఆర్బీకేల పరిధిలో మల్టీ పర్పస్ సెంటర్లు (బహుళ సదుపాయాల కేంద్రాలు), జనతాబజార్లు, ఫామ్ గేటు మౌలికసదుపాయాలు తదితర వాటి ఏర్పాటు విధానానికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం
వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో పంట నాటుకునే ముందు, పంట చేతికొచ్చిన తర్వాత రైతుకు కావాల్సిన మౌలిక సదుపాయల కల్పనే ఈ మల్టీ పర్పస్ సెంటర్ల ఉద్దేశం రూ. 2719.11 కోట్లతో ఫామ్ గేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివద్ధి చేసేందుకు కేబినెట్ ఆమోదం ఈ మొత్తం పనులన్నింటినీ సుమారు రూ.12 వేల కోట్లతో చేపట్టనున్న ప్రభుత్వం
7.
చిత్తూరు జిల్లా పెనుమూరులో, కార్వేటినగరంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను 50 పడకల ఆసుపత్రులుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం
8.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డిగ్రీ కళాశాలలో 24 టీచింగ్ పోస్టులు, 1 నాన్ టీచింగ్, 13 అవుట్ సోర్సింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
9.
వైయస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి జాయింట్ వెంచర్ ఎంపిక ప్రక్రియకు కేబినెట్ ఆమోదం ఎస్.బి.ఐ.క్యాప్ సిఫార్సుల ప్రకారం జాయింట్ వెంచర్ భాగస్వామి ఎంపికకు ఆమోదం ఎస్బీఐక్యాప్ సిఫార్సులను అనుసరించి లిబర్టీ స్టీల్ ఇండియా లిమిటెడ్ జేవీగా ఎంపిక తొలిదశలో రూ. 10,082 కోట్ల వ్యయం, రెండో దశలో రూ.6వేల కోట్లు వ్యయం జేవీపై వైయస్సార్ స్టీల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీకి ఎల్ఓఏ ఇచ్చేందుకు అనుమతి
11.
వైయస్సార్ జిల్లా జమ్ములమడుగు మండలం పెద్దండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల్లో 3148.68 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్కు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం ఈ స్ధలంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి నిర్ణయం
12.
వైయస్సార్ జిల్లా వల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రియల్ పార్కు కోసం భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం
13.
వైయస్సార్ జిల్లా సీ కే దిన్ని మండలం కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి ఏపీఐఐసీకి స్ధలం కేటాయింపు
14.
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో 165.34 ఎకరాలు ఏపీ మారిటైం బోర్డుకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం పోర్టు కార్యకలాపాల కోసం భూమి కేటాయింపు ఎకరా రూ.25 లక్షలు చొప్పున భూమి కేటాయింపు
15
ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్టు –1974 సవరణకు కేబినెట్ ఆమోదం
16.
వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 12 పోస్టులు మంజూరు.
17.
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం జీడీ నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గంలో సదుం మండలంలో కూడా మరో రెండు కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
18. తిరుమల తిరుపతి దేవస్ధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు స్ధలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరిన టీటీడీ. ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
19.
ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి రెడ్హేండెడ్గా పట్టుబడ్డ డిసిప్లీనరీ కేసులను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని నిర్ణయం, కేబినెట్ ఆమోదం